మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎస్పి సునీల్ దత్ అదేశానుశారం గంజాయి అక్రమ రవాణా, నిల్వలను అడ్డుకట్టవేసేందుకు సోదాలు నిర్వహించడం జరుగింది. అందులో భాగంగా శనివారం సాయంత్రం అశ్వారావుపేట సీఐ బంధం ఉపేందర్ రావ్ మరియు వారి సిబ్బంది తో కలిసి అశ్వారావుపేట లోనీ ఓల్డ్ వి కే డి వి ఎస్ కాలేజీ, పేపర్ బోర్డు ఖ్వార్టర్స్, కాకతీయ గెట్ లారీ ఆఫీస్ ఏరియా, సంత మార్కెట్ మరియు పాన్ షాప్స్ లో విస్తృత తనికీలు చేపట్టడం జరిగింది. గంజాయి సేవించి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎవరైనా, గంజాయి సేవించిన, సప్లై చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయిని సిఐ బంధం ఉపేందర్ రావు హెచ్చరించారు.
Post A Comment: