మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమెర్థా గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇరుగు శ్రీనుకు వైద్య ఖర్చుల నిమిత్తం గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ వారు 15000/- రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. పురుగు కుట్టడం వలన ఇన్ఫెక్షన్ కావడంతో ఎడమచేయి పూర్తిగా దెబ్బతింది. వైద్య ఖర్చుల కోసం గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులయిన సోమయ్యను ఆశ్రయించగా బాధితుని వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమయ్య, నారాయణ రాజు, పివీజి వర్మ పాల్గొన్నారు.
Post A Comment: