క్రీడల తోనే మానసిక ఉల్లాసం:ఎంపీపీ రేగా కాళిక,జెడ్పీటీసీ కొమరం కాంతారావు, ఏడుళ్ళ బయ్యారం సిఐ దోమల రమేష్,కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్
మన్యం టీవి, కరకగూడెం:కరకగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరకగూడెం,పినపాక మండలాల స్థాయి క్రికెట్ క్రీడలను ఎంపీపీ రేగా కాళిక, జెడ్పీటీసీ కొమరం కాంతారావు, ఏడూళ్ళ బయ్యారం సిఐ దోమల రమేష్, ఎస్ఐ టివి సూరి, కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్,మణుగూరు ఎస్ఐ నరేష్ ప్రారంబించారు.అనంతరం జడ్పిటిసి కొమరం కాంతారావు బౌలింగ్ చెయ్యగా ఎంపీపీ రేగా కాళికా బ్యాటింగ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాలతోనే మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ భావం పెంపోందిస్తుందన్నారు. అనంతరం ఏడుళ్ళ బయ్యారం సిఐ దోమల రమేష్ మాట్లాడుతూ ప్రతి క్రీడా కారుడు క్రీడా స్పూర్తితో ముందుకు సాగుతు క్రీడా స్పూర్తిని చాటాలన్నారు అన్నారు.అదేవిధంగా ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇటువంటి క్రీడలు నిర్వహించడం అభినందనియమని అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ట్రైనింగ్ ఎస్ఐ గణేష్ రంగపూరం సర్పంచ్ ఇర్ప అశ్వినీ- సూర్యనారాయణ, ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఇర్ప నాగేశ్వరరావు కరకగూడెం,పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,సభ్యులు, గ్రామస్తులు,వివిధ గ్రామపంచాయతిల సర్పంచ్ లు పాల్గొన్నారు.
Post A Comment: