CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయితీ కార్మికులు దీక్ష

Share it:

 


 👉పూలమాల వేసి సంఘీభావం తెలిపిన సిపిఎం మండల కార్యదర్శి రాంబాబు 

మన్యం టీవి,ములకపల్లి: గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న రెండవ రోజు దీక్షకి సంఘీభావంగా సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు గ్రామపంచాయతీ సిబ్బందికి పూలమాలవేసి దీక్ష ను ప్రారంభించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మల్టీపర్పస్ అనే విధానాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సిబ్బందిని,ఇతర సిబ్బందిని మరింత పని ఒత్తిడికి గురి చేస్తుందని,చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారని కరోనా సమయంలో వీరు ఫ్రంట్లైన్ వర్కర్లగా ముందుండి కరోనా వచ్చిన వ్యక్తులను దహన సంస్కారాలు చేసే విషయమై ముందుండి నడిచారని పారిశుద్ధ్యంలో ముందడుగు వేసి పరిసరాలను శుభ్రపరచడం వలనే కరోనా తగ్గుముఖం పట్టిందని అటువంటి కార్మికులకు వేతనాలు కోయటం అనేది దుర్మార్గమని ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

కార్మిక వర్గానికి ఎల్లప్పుడూ సిపిఎం పార్టీ అండదండలు ఉంటాయని చెప్పారు అంతేకాకుండా కార్మికులకు ఈఎస్ఐ,పీఎఫ్, సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని ట్రాక్టర్ నడిపే వాళ్లకు గ్రామ పంచాయతీ సర్పంచ్ లైసెన్స్ ఇప్పించాలని, డిమాండ్ చేశారు.అదేవిధంగా వన సేవకులకు ప్రత్యేక నిధులు కేటాయించి, వారికి కచ్చితమైన వేతనాలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు.షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి వంటి అక్రమాల్లో సెక్రెటరీ పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అనంతరం కార్మికులందరూ ఐక్యతగా పోరాడితే మీ సమస్యలు మీరూ పరిష్కరించుకోవడం సులువు అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ శ్రీను,చిక్కుల శ్రీను,వెంకన్న, సాయి,దిన క్లబ్బులు కందుకూరు వెంకన్న, మేకల రమేష్ ,తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: