మన్యం టీవి, కరకగూడెం: మండలరిదిలోని సీతారంపూరం గ్రామనికి చెందిన పోలెబోయిన సత్తి బాబు ( 40)అనే వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. అయన మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలముకు న్నాయి.మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మెరప మొక్కలు నాటడం కోసం తాటిగూడెం గ్రామలో మిర్చి నారుకోసం వెల్లి చాతి భాగంలో నొప్పి రావడంతో ఇంటికి వచ్చి మంచంపై పడుకోని అక్కడకి అక్కడే మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజరి క్రిష్ణ సందర్శించి ప్రగడ నివాళులు అర్పించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కుటుంబ సభ్యులకూ ప్రగడ సానుభూతి తెలిపారు.మృతుడికి భార్య కూతురు లాస్య ,కుమారుడు లక్కి ఉన్నారు.
Post A Comment: