బస్టాండ్ భూమి కబ్జా చేసిన వారిపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్. మన్యం టీవీ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సురక్ష బస్టాండ్ అభివృద్ధి పనులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఆర్టీసీ అధికారుల తో కలిసి పరిశీలించారు.విప్ రేగా కృషి తో డిఎంఎఫ్ నిధుల నుండి రూ.70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అధునాతన బస్టాండ్.ఈ సందర్భంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్, మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,నాయకులు వట్టం. రాంబాబు,ఎడ్ల శ్రీను,కృష్ణ, యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: