మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీరే తల ఒక్క రూపాయ జమచేసుకోని అభివృద్ధి చేసుకోండి.గొల్లగూడెం గ్రామంలో పాడుపడ్డా బావి పుడ్చమంటె దురుసుగా సమాధానంమన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గల సమత్ మోతే గ్రామపంచాయతి గొల్లగూడెం గ్రామంలో జరిగిన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు సంబంధించిన స్పెషల్ ఎన్ రోల్మెంట్ డ్రైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా జరిగిన గ్రామసభకు ముఖ్య అథితిగా కరకగూడెం ఎంపీఓ చిరంజీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గొల్లగూడెం గ్రామస్థులు గ్రామంలో ఉన్న సుమారు 50 సం,,క్రీతం తీసిన బావి ప్రమాదంగా ఉంది.గత మూడు విడతలుగా జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన పుడ్చలేదు.కనీసం మీరు అయిన పుడిపించండి సార్ అని అడుగుతే మీ రెవరు? మీ వార్డు నెంబర్ ఎక్కడ ? నా భాషా అంతే నేను ఇలాగే మాట్లాడుత అంటు గ్రామస్తులకు దురుచుగా సామ దానం చెప్పారు. అంతేకాకుండా మీ గ్రామస్తులు అందరూ ఏం చేస్తున్నారు. తల ఒక్క రూపాయి జమచేసుకోని అ బావి పూడ్చుకోండి.ఈ గ్రామనికి వస్తున్న ఎప్ ఎప్ సి నుండి వచ్చె డబ్బులతో పల్లె పకృతి వనానికి మొక్కలు కొనడానికి, గ్రామపంచాయతి సిబ్బంది డబ్బలు ఇవ్వడానికే సరిపోవడం లేదు అంటు దురుసుగాసమాధానం ఇచ్చారు అంటు గ్రామస్తులు తెలిపారు.ఇది ఇలా ఉండాగా మా గ్రామంలో రోడ్డు కి ఇరువైపుల, పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కోరగా మీ కళ్లకు కనపడటం లేదా అక్కడ అంటు సామ దానం చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులు,స్థానిక ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు దృష్టికి తీసుకుపోతం అంటే ఏం బెదిరిస్తున్నారా అంటు వెళ్ళి పోయారు. ఇప్పటికైన జిల్లా కలెక్టరు ఇటువంటి ఎంపీఓ పై చర్యలు తీసుకోని మా గ్రామంలోని పాత బావిని పుడిపించగలరి గొల్లగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: