తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా మాజీ అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ డిమాండ్
మన్యం టీవీ మంగపేట.
ఆర్యుల కుట్రలతో బలైన రావణాసుర,నరకాసుర, మహిషాసురులను రాక్షసులుగా చిత్రీకరించి నేటికీ దేశవ్యాప్తంగా వారిని దహన కార్యక్రమాలు చేపట్టడం అంటే దేశంలో మరింత హింసను ప్రేరేపించడమేనని రాజమల్ల సుకుమార్ ఎ స్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు అన్నారు. గురువారం మంగపేట మండల కేంద్రంలో రావణాసుర వర్ధంతి సందర్భంగా సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రాచ్య దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు మన దేశం లోని భారతీయ స్థానిక రాజుల పై దాడులు జరిపి వారిని ఓడించి భూభాగాన్ని ఆక్రమించుకున్నారని వారన్నారు.మన భారతీయులైన ద్రావిడులను వారు రాక్షసులుగా చిత్రీకరించి రాక్షసులు కాబట్టే యుద్ధంలో ఓడిపోయారని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని, ఈక్రమంలోనే రావణాసురుడు, నరకాసురుడు, మహిషాసురుని ,శిభి చక్రవర్తి లాంటి రాజులను చంపి వేసి నేడు దేశంలో పండుగలు చేసుకునే హింసాత్మక సంస్కృతిని ప్రోత్సహించే వేడుకలలో ప్రజల భాగస్వామ్యం ఉండకూడదని వారు అన్నారు. విజయ దశమి వేడుకల పేరుతో వారి చిత్రపటాలను బాంబులతో పేల్చి వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమల్ల సుకుమార్ డిమాండ్ చేసారు.
Post A Comment: