మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం లో కొలువుదీరి ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత ముఖద్వారం (ఆర్చి) ని గురువారం జూలూరుపాడు పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తో కలిసి ప్రారంభించారు. అనంతరం దేవతల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అతిధులకు ఘన స్వాగతం పలికారు. స్వాగత ద్వారం ఏర్పాటుకు సుమారు ఐదు లక్షల రూపాయల ఖర్చుతో తన భక్తిని చాటుకున్న వెంగన్నపాలెం గ్రామానికి చెందిన చేతన్ జ్యూయలర్స్ యజమాని రవి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎం పి టి సి కాజా విజయరాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు ఆళ్ళ ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు లేళ్ళ గోపాల రెడ్డి, ఆలయ ప్రధాన పూజారి కట్రం నరసింహారావు, కుల పెద్ద ముక్తి కృష్ణారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: