CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ

Share it:

 



అక్టోబరు 24న ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ


ఆదివాసీలందరు హాజరు కావాలని ప్రచారం


మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట పంచాయితీలో అక్టోబర్ 24 వ తారీకున కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆదివాసీల ఆరాధ్యదైవం, గోండు వీరుడు కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఆదివాసి బిడ్డ హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పంచాయతీలోని పలువురు ఆదివాసీలకు కరపత్రాలను పంచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ నాయకులను ఆహ్వానించి, ఆదివాసి ఐక్యతను చాటే విధంగా, కార్యక్రమం ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పక హాజరుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచులు మొగిలిపల్లి నరసింహారావు, బాడిస మహేష్, పిజ్జా కమిటీ సభ్యులు దుబ్బ గోవర్ధన్, గ్రామస్తులు ఏనిక రాము, తాటి బుచ్చయ్య, సోడె కృష్ణ, కొమరం రాజశేఖర్, ఐక్య వేదిక కన్వీనర్ సోలం అశోక్, ఆదివాసీ మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: