స్థానిక ఎస్.ఐ రాజు
మన్యం టీవీ ఏటూరు నాగారం
కన్నాయిగూడెం మండలంలోని ప్రతి గ్రామంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దసరా (విజయదశమి)వేడుకలను జరుపుకోవాలని స్థానిక ఎస్ ఐ రాజు తెలిపారు.
విజయదశమిని పురస్కరించుకుని మండలంలో రావణవధ కార్యక్రమాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జరుపుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ విజయదశమిపూజ,రావణాసుర దహనం కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.రావణాసురుడి ప్రతిమకు నిప్పు అంటించే వేళ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.సాదారణంగా దసరా పర్వదినం రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడంతో పాటు పనిముట్లు,యంత్రాలు,వాహనాలకు ప్రత్యేక పూజలు చేపతారు కాబట్టి జాగ్రత్తగా పూజలు నిర్వహించాలని అన్నారు.
Post A Comment: