ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి
గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 11 (మన్యం మనుగడ) మండలంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు. సోమవారం మిషన్ భగీరథ ఏ ఈ కిషోర్, విద్యుత్ శాఖ ఏ ఈ రవి తో కలసి రాయి గూడెం గ్రామంలో ఆమె పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలములోని అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. రాయి గూడెం గ్రామంలో మరో నెల రోజుల కల్లా పూర్తిస్థాయిలో మంచినీరు అందిస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారన్నారు
Post A Comment: