మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని తాటి బుచ్చన్నగూడెం గ్రామంలో గిరిజన ఆడపడుచులు, చిన్నారులు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో ఆదివాసీ నాయకుడు, టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడైన జారే ఆదినారాయణ పాల్గొని, గిరిజనులతో కలిసి సందడి చేశారు. అనంతరం గిరిజన మహిళలు, ఆదినారాయణ ను గౌరవంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసి అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు-వాడే రాంబాబు, గ్రామ గిరిజన యువకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: