గుండాల ఆళ్ల పల్లి అక్టోబర్ 13 (మన్యం మనుగడ) ఆగివున్న బైకును వెనక నుండి డీ కొట్టి కింద పడడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన ఆళ్లపల్లి మండలం లో చోటు చేసుకుంది. రాయి గూడెం గ్రామానికి ఈసం సమ్మయ్య రామాంజి గూడెం నుండి తన స్వగ్రామమైన రాయి గూడెం కు వస్తున్న క్రమంలో వాన పాకుల ప్రేమ్ కుమార్ ద్విచక్ర వాహనం ఆపి చరవాణిలో సంభాషిస్తున్న ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ వాహనాన్ని వెనకనుండి ఢీకొట్టి సమ్మయ్య కింద పడటంతో గాయాలపాలయ్యాడు. 108 వాహనంలో ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు
Post A Comment: