CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లఖీంపూర్ ఖేరీ రైతు అమరులకు పుష్పాంజలి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలలోని చిన్న బోయినపల్లి గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు యండి యాకుబ్,వడకపురం సారయ్య లు మాట్లాడుతూ..కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖీంపూర్ ఖేరీ రైతులను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకు ముందు

ఏటూరు నాగారం మండల కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా,అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు అఖీంపూర్ రైతు అమరులకు పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి యాకుబ్ సారయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత పదకొండు నెలలుగా రైతులు జరుపుతున్న ఉద్యమం ను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదని అన్నారు. రైతులపై లాఠీ చార్జి,భౌతిక దాడుల చేయాలని,కేంద్ర మంత్రులు,హర్యానా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం,మరుసటి రోజు శాంతియుత రైతు ఉద్యమం పై కారు నడిపి రైతులను చంపిన ఘటనను ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖాదర్ బాబు,సురేందర్,అర్వపల్లి మౌలానా,హైరుణ్,రవి,అన్వర్, ఇస్మాయిల్,పాపిరెడ్డి, గుంషావలి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: