మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధిలోగల అంగన్వాడి టీచర్లకు పెద్ద నల్లబెల్లి రైతు వేదికల్లో చిరుధాన్యాల పంటల పై అంగన్వాడి టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ సుహాసిని పూర్ణ చిరుధాన్యాల కొర్రలు సామలు జొన్నలు రాగులు తో వంటకాలను చేసి చూపించారు వీరికి సహాయం గా టీచర్లు కూడా సహకారం అందించారు. కొర్రల పాయసం , కుర్ర పులిహార, రాయపూడి ,రాగి లడ్డు, తయారు చేశారు ప్రాజెక్టు సిడిపిఓ మాట్లాడుతూ చిరుధాన్యాల్లో ఉంటే కాల్షియం ఐరన్ ,ప్రోటీన్లు, ఫైబర్, జింకు ఇతర పోషకాలు ఎక్కువ ఉంటాయని వివరించారు. దీనిద్వారా గర్భిణులు బాలింతలు పిల్లలకు వచ్చే రక్త హీనతను పోషకాల లోపం నివారించవచ్చని అన్నారు చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ప్రదర్శనకు ఉంచారు ఈ కార్యక్రమంలో సి పి డి ఓ నవ్య శ్రీ సూపర్వైజర్లు కవిత,దనలక్షి, సావిత్రి, మాణిక్యమ్మ టీచర్లు పాల్గొన్నారు
Post A Comment: