మన్యం టీవి,పినపాక:
పినపాక మండలం ఏడేళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల రాధిక హైస్కూల్లో ఎస్బిఐ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అవినీతి నిర్మూలన అనే అంశంపై వ్యాసరచన పోటీలను వక్తృత్వ పోటీలను నిర్వహించారు. శ్రీ విద్య ,రాధిక హై స్కూల్ కు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు మేఘన,శ్రీవాహిని,హర్షిత లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఈ .బయ్యారం యాజమాన్యం విద్యార్థులకు పోటీ నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక హై స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి,సంపత్ రెడ్డి, ప్రిన్సిపల్ అనురాధ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: