మన్యం టీవీ ఏటూరు నాగారం; షెడ్యూల్డ్ ఏరియా లోని గిరిజన భూభాగం లో గల భూములకు గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వద్దని మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య అన్నారు.శనివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు నల్ల బోయిన లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వీరయ్య హాజరై మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలు భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్థానికులైన కోయ,నాయకపోడు,చెంచు తెగల గిరిజనులకు ప్రభుత్వ రెవెన్యూ,ఫారెస్ట్ భూములకు తరతరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఏరియాస్ రెగ్యులేషన్ 1359 ప్రకారం ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ,బిసి,ఓసి,ఎఫ్ సి కులాల వారికి ఏజెన్సీ ప్రాంతంలోని భూభాగంలోని భూములకు పట్టాలు ఇవ్వద్దని ఇచ్చిన అవి చల్ల వన్నారు. పార్లమెంటు బిల్ షెడ్యూలు అటవీ హక్కుల గుర్తింపు 2005 ప్రకారం మైదాన ప్రాంత గిరిజనులకు వలస వచ్చిన గిరిజనులకు హక్కులు లేవని 2009లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.వలస వచ్చిన గిరిజనులు బి సి (డి) కులానికి చెందినవారు అవుతారని అన్నారు.
Navigation
Post A Comment: