మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట(అక్టోబర్-30):: మండలంలోని ఎర్రగుంపు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం లో, శనివారం నాడు అత్యంత వైభవంగా మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించిన సీతా రామ, లక్ష్మణ, ఆంజనేయ, గణపతి, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, దేవతల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కట్రం నరసింహారావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం రామాలయ అభివృద్ధికి 10,116 రూపాయల విరాళం, ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ విగ్రహల ప్రతిష్ట పూజా కార్యక్రమంలో కట్రం నరసింహారావు తో పాటు టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, యూత్ కాంగ్రెస్ నాయకులు పూనెం ప్రదీప్ కుమార్, వాడే వీరస్వామి, కాకా శివ శంకర్ ప్రసాద్, వాడే ప్రవీణ్ కుమార్, ఆరెం ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యులు తాటి రామచంద్ర రావు, వాడే భద్రం తదితర గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు.
Post A Comment: