*సంగి సందీప్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్
మన్యం టీవీ ఏటూరు నాగారం
ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వినియోగించు కోవాలని వైద్య సిబ్బందులు కోరుతున్నారని మన ఆరోగ్యం కోసం వారు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కోవిడ్ వైక్సిన్ వేసుకోవాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో మంగళవారం తారక రామా కాలనీకి చెందిన15 మంది యువత వైద్య సిబ్బందులు మకోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి వైక్సిన్ తీసుకోవడం జరిగిందని, అన్నారు.
అలాగే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి కరోనా అంతరించిందని అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యువతి,యువకులు,ప్రజలు వ్యాక్సిన్ పట్ల అపోహలను విడి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి కరోనా వ్యాక్సిన్ ప్రాణాలను కాపాడుతుంది. కరోనా కట్టడిలో భాగంగా అహర్నిశలు ప్రజా శ్రేయస్సుకై కష్టపడుతున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని.కరోనా నుండి ప్రజలను రక్షించడానికి పోరాడేది వారే అని వారి సేవలు యావత్ దేశానికి ఆదర్శమని కొనియాడుతూ ఈ సందర్భంగా వారి సేవలకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యువత ముందస్తులో వుండి ప్రజలకు అవగాహన కలిపించాలని అది మన బాధ్యత అని అన్నారు.
ఈ కార్య క్రమంలో కొమ్ముల రాజు,సంగి శివ,కొగిలా అజయ్,రత్నం కిషోర్, మామిడి శేఖర్,శ్యామ్,సంగి ప్రశాంత్,పత్రి తేజ,గుండె శరత్, పాయముల శివ, సాగర్,చందు,శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: