CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సడక్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని

కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్యలు పరిస్కారం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కి కుర్చీ దొరకడం లేదా అని,పోడు భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి కొత్తపొడు కొట్టేది లేదు పాత పోడు వదిలేది లేదు .... అని 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు జాలపు అనంత్ రెడ్డి మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ముజఫర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య,ఎస్ టి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిరిల వెంకన్న,మండల నాయకులు ముదురుకొల్ల తిరుపతి,ఎస్సీ సెల్ మండలం అధ్యక్షుడు వావిలాల రాంబాబు,పిఎసి ఎస్ డైరెక్టర్ ఆశాడపు మల్లయ్య,పాక రాజేందర్ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు దబ్బకట్ల సుమన్,కాల్వపల్లి మాజీ సర్పంచ్ సిద్ధ బోయిన శ్రీనివాస్,కామరం సర్పంచ్ రేగా కళ్యాణి,సిద్దబోయిన నర్సింగరావు,యాలం శంకరయ్య,పురుషోత్తం,నర్సింహులు,నారాయణ,దాబాసి సుధాకర్,కోటే నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: