పాలకవర్గం లేక కుంటుపడుతున్న పాలన:
విప్, ఎమ్మెల్యే రేగా
మన్యం మనుగడ,డెస్క్:
శీతాకాల సమావేశాల సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు శాసనసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల లేని మున్సిపాలిటీలలో ప్రజల మనోభావాలను వ్యక్తపరిచారు. చాలావరకు మునిసిపాలిటీలలో పాలకవర్గం లేకపోవడం వలన పరిపాలనా కుంటుపడుతుందని, ప్రభుత్వాన్ని అపహాస్యం చేసే అవకాశం ఉందని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ విషయాన్ని గ్రహించి సాధ్యమైనంత త్వరలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి, కౌన్సిలర్ల నియామకం జరిగే విధంగా చూడాలని శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన విజ్ఞప్తిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే విమర్శలు అంటారని, సమస్యల గురించి మాట్లాడకుంటే నియోజకవర్గ ఎమ్మెల్యే మౌనం పాటిస్తున్నారు అని, పాలక వర్గానికి అమ్ముడుపోయారని అనడం సమంజసం కాదని, మీడియా మిత్రులందరూ ఈ విషయాన్ని గ్రహించి, సమస్యల గురించి పోరాడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: