దమ్మపేట అక్టోబర్ 04(మన్యం న్యూస్):- దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేసిన అటువంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు తిరివేద వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గంగిశెట్టి గంగాధర్ జగదీశ్ కుమార్ ,జిల్లా గవర్నర్ రేగూరి హనుమంతరావు,సెక్రటరీ ఎర్రం సుజాత, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కో ఆర్గనైజర్ దమ్మపేట వైస్ ఎంపీపీ ద్వారా మల్లిఖార్జునరావు, పట్వారీగూడెం పంచాయతీ సర్పంచ్ మొగిలి అంజలి, వైస్ సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య , శీమకుర్తి దుర్గాప్రసాద్, జంగాల అప్పన్న, పరిటాల నాగ చక్రవర్తి, పైడి రాంబాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: