మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, గుంపెన గ్రామ పంచాయతీలోని కోయ కట్టుగూడెం గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా, పల్లెల్లో కరోనా మరణాలు తగ్గించేందుకు, ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో వారి సిబ్బంది రాత్రి సమయం వరకు నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెచ్వి-బి శారారాణి,ఎఎన్ఏం లు- కలం జయలక్ష్మి, కాక ప్రేమలత, సవలం పుష్ప రాజ్యం తదితరులు ఉన్నారు.
Post A Comment: