CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిమ్మాపురానికి వసతులు కల్పిస్తాం ఐటీడీఏ పీవో గౌతమ్

Share it:

 



 మన్యం టీవి, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సోమిని శివప్రసాద్ ఆధ్వర్యంలో భద్రాచలం నందు ఐటీడీఏ పీవో గౌతమ్ ని తిమ్మాపురం గ్రామస్తులతో సహా కలవడం జరిగింది. వేదాంతపురం గ్రామ పంచాయతీ అయినా తిమ్మాపురం గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం చేత తిమ్మాపురం గ్రామానికి మౌళికవసతులు అనగా విద్యుత్, త్రాగునీరు మరియు పంచాయతి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదని వివరించడం జరిగింది. అందుకు స్పందించిన పీఓ గౌతమ్ తిమ్మాపురానికి ఖచ్చితంగా విద్యుత్, త్రాగునీరు కి సంబంధించిన పనులు వెంటనే ప్రాంభించేలా చర్యలు తీసుకుంటానని, చాలా తక్కువ సమయంలో పనులు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు సర్పంచ్ మరియు గ్రామస్తులు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: