అడవిపై హక్కు ఆదివాసీలదేనని ఆదివాసీలను అడవుల నుండి ఖాళీ చేయించి వారి పొట్ట కొట్టే చర్యలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆపాలని మణుగూరులో జరిగిన సడక్ బంద్ సందర్భంగాఅఖిలపక్ష నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలు పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాహక్కుఇవ్వాలని పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారులు పోలీసుల దాడులను నిలిపివేయాలని హరితహారం పేరుతో పోడు భూముల అక్రమ ఆక్రమణను నిలుపుదల చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మణుగూరు లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్ అధ్యక్షతన జరిగిన సడక్ బంద్ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి అయోధ్య న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ టిడిపి జిల్లా అధ్యక్షులు వట్టం నారాయణ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కాటబోయిన నాగేశ్వరరావు గురజాల గోపి పిరినాకి నవీన్ సిపిఐ నాయకులు అక్కి నరసింహారావు సుధాకర్ న్యూడెమోక్రసీ నాయకులు జగ్గన్న విక్రమ్ గౌస్ పాష రైతు కూలీ సంఘం కార్మిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు
Post A Comment: