*ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే సీతక్క బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతరకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జాతర లో మేడారం జాతర రెండో స్థానంలో ఉంది అని, ఇటువంటి అతిపెద్ద జాతరకు ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు కేటాయించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.ములుగు జిల్లా కలెక్టర్ మేడారం జాతర అభివృద్ధికి 112 కోట్లతో వివిధ శాఖల నుండి మేడారం జాతర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందని,రాబోయే సమ్మక్క-సారలమ్మ జాతరకు తక్షణమే నిధులు కేటాయించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆమెతో పాటు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు,మంకీ డి బుచ్చయ్య,సిద్ధబోయిన అరుణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: