మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 4 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నీతీ ఆయోగ్ కమిటీ డైరెక్టర్ బి దేవి ప్రసాద్, జిల్లా వైద్య అధికారిని శిరీష తో కలిసి సోమవారం పరిశీలించారు. వైద్యశాలలోని వివిధ వార్డులను, వైద్య అధికారుల పనితీరును, ప్రభుత్వ ఆసుపత్రికి రావలసిన సదుపాయాలను, అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆరోగ్య యంత్రాంగం ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, అన్నారు. కరోనా వ్యాక్సిన్ నేషన్ పనితీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలూరుపాడు మండలంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తిచేసేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ వీరబాబు, సిహెచ్ వొ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ సుభద్ర, హెడ్ నర్స్ సత్యవతి, స్టాఫ్ నర్స్ పుష్ప, ఫార్మసిస్ట్ శశికళ, ల్యాబ్ టెక్నీషియన్ హఫీజూద్దీన్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: