కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
*గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగారం మండల నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, వావిలాల నర్సిగారావు,
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల నాయకులు ఖలీల్ ఖాన్, వావిలాల నర్సింగరావు హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట
రఘు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు,ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారనీ సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ,సత్యాగ్రహము అతని ఆయుధాలు.కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి,నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ,కులాలూ ఒకటే అని చాటాడు అని దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన యోధుడు మహాత్మా గాంధీ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి నరేందర్, మండల నాయకుడు సప్పిడి రాము,మండల యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్,ఎస్టి సెల్ మండల అద్యక్షుడు చేల వినయ్,
మాజీ సర్పంచ్ బాసిత్ బాబా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,ఎస్కే బాబా,రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకింది రాజు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు వావిలాల సాంబశివరావు సీనియర్ నాయకులు
కునూరు కృష్ణ,మామిడి రాంబాబు తదితరులు
పాల్గొన్నారు.
Post A Comment: