మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని తొగ్గూడెం పంచాయతీకి చెందిన వలస ఆదివాసీ గ్రామం టేకులగూడెం. ఆ గ్రామంలోని బాల వెలుగు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వేడుకలు జరిగాయి. జన జీవనానికి దూరంగా గడుపుతున్న ఇప్పటికీ భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ గురించి ఆదివాసి ప్రజలకు ప్రధానోపాధ్యాయుడు వివరించడం జరిగింది. స్వాతంత్ర కాంక్ష కోసం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఫలితం లభించిందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆదివాసి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టేకుల గూడెం గ్రామ పెద్ద నూప భద్రయ్య, కోషయ్య, రమేశ్, సోమయ్య జోగయ్య, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: