భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 3 (మన్యం టీవీ) :- ఆదివారం నాడు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గల కొత్తగూడెం క్లబ్ నందు మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వార్డు 31వ వార్డ్ కౌన్సిలర్ కోలాపూరి ధర్మరాజు అధ్యక్షతన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సుమారు రూ 318 కోట్లతో ,19 రంగులు,17 డిజైన్లతో తెలంగాణ రాష్ట్రం మొత్తం బతుకమ్మ చీరలు ను పంపిణీ చేయడం జరుగుతుందనీ. కొత్తగూడెం మున్సిపల్ పరిధలో సుమారు 20,200 బతుకమ్మ చీరలు 25 సెంటర్లలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, తెలంగాణలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరలు ఏర్పాటు చేశారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవం కల్పిస్తున్నారని,దీనివలన చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందనీ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం తాసిల్దార్ వి.రామకృష్ణ, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,టిఅర్ఎస్ రాష్ర్ట నాయకులు వనమా రాఘవేంద్ర రావు, కౌన్సిలర్స్ , కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు,రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: