మన్యంటీవి, అశ్వారావుపేట: బతుకమ్మ పండుగ రోజు ప్రతి ఆడపడుచు ముఖంలో చిరునవ్వు చూడాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముఖ్య
ఉద్దేశమని ఊట్లపల్లి సర్పంచ్ సాధు జ్యోస్నా భాయి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఉట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యలయం పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతకమ్మ చీర కట్టుకొని ఊట్లపల్లి సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఊట్లపల్లి సర్పంచ్ జ్యోత్స్న బాయ్ మాట్లాడుతూ... తెలంగాణ లో బతుకమ్మ పండుగ ఎంతో ముఖ్యమైనది తీరొక్క పువ్వులతో గౌరమ్మ తో బతుకమ్మను పేర్చి కొత్త వస్త్రాలు ధరించి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి కూడా ఆకర్శణీయమైన రంగులతో రూపుదిద్దుకున్న చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహా నేత సీఎం కేసీఆర్ అని సర్పంచ్ జ్యోత్స్న భాయి అన్నారు. ఈ కార్యక్రమం లో సెల్స్ మెన్, అంగన్వాడీ టీచర్స్, వార్డ్ నెంబర్స్
గ్రామ దీపికలు, గ్రామాల ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: