మన్యం టీవీ మంగపేట.
హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రథమ మహాసభ,విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శి, తదితరులు పదవులకు ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా మంగపేట మండలంనకు చెందిన కేశోజు వెంకటాచారి ని నియమించటం జరిగింది.రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ లాల్ కోట వెంకటాచారి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వేములవాడ మదన్ మోహన్ చారి,.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోల్లేటి కృష్ణమాచారి, ములుగు జిల్లా అధ్యక్షులు గాదె అమృత చారి,ప్రధాన కార్యదర్శి నాగ చారికి ఈసందర్బంగా కేశోజు వెంకటా చారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈసందర్బంగా కేశోజు వెంకటాచారి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను విశ్వకర్మల సమస్యలు తెలుసుకుని వారికి పరిష్కార మార్గం చూపుతానని విశ్వకర్మ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేసారు . ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం హోం శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్,అటవీ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ మొట్టమొదటి మాజీ స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనా చారి, తదితరులు హాజరైనారు.
Post A Comment: