మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం పూనెం నగేష్ అద్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో(ARRM)ఆదివాసీ అదికార్ రాష్ర్టీయ మంచ్ జాతీయ చైర్మన్ మాజీ ఎం పి డాక్టర్ మిడియం బాబురావు హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా విదానాలవల్ల ఆదివాసీలు హక్కులు హరించి పోతున్నాయని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు సాగు చేస్తున్న పోడుభూములుకు హక్కు పత్రాలు ఇవ్వవలసిన ప్రభుత్వాలు ఆభూములు గుంజుకుంటున్నాయనారు. అనేక రకాల ఇబ్బందులు దాడులు జరుగుతున్నాయని ఈ దాడులను ఎదుర్కొంటకు మన సంఘం ముందుండాలన్నారు. అఖిలపక్షం తలపెట్టిన పోడు రైతు పొలికేక కార్యక్రమాన్ని గ్రామ గ్రామ న విస్తృతంగా ప్రచారం చేయాలనారు.ఈ క్రమంలో జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య ,గొంది రాజేష్,కోటి క్రిష్ణారావు,జజ్జరి దామోదర్,బచ్చల క్రిష్ణబాబు, చందా లక్ష్మీ నారాయణ,కోరం చిరంజీవి,తోలెం కిష్టయ్య లు పాల్గొన్నారు.
Post A Comment: