గుండాల అక్టోబర్ 1( మన్యం మనుగడ) గులాబ్ తుఫాన్ వల్ల గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, పత్తి, మిర్చి పంటలకు తుఫాన్ ప్రభావం వలన నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్న నేల కొరగడంతో చేతికొచ్చిన పంట నేల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మిర్చి చేనులో ఇసుక మేటలు పోయడం వలన ఆ పంటలకు నష్టం వాటిల్లింది. వర్షం ధాటికి చెరువులు తెగిపోవడం వలన అందులో ఉన్న నీళ్లు మొత్తం పొలాల మీదుగా పోవడం వలన వరి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుఫాన్ వల్ల పంటలు నష్టపోయాయని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: