మన్యం టీవీ ఏటూర్ నాగారం
ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... జర్నలిస్టుల ఆందోళనలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని నేడు 2న,తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల నిరసన కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి వినతి పత్రం అందజేశారు.కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు నేలకొరిగినా... బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం విచారకరం. జర్నలిస్టుల ప్రాణాలకు పాలకులు భరోసా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం.ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వార్తలు రాస్తున్న పాత్రికేయులపై,మీడియా సంస్థలపై,పౌర హక్కుల కార్యకర్తలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలో బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు . జర్నలిస్టుల ఆరోగ్య భద్రతా, ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తున్నాం. ఏటూర్ నాగారంలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టి మహాత్మాగాంధీకి వినతిపత్రాన్ని అందజేశారు . జర్నలిస్టు మిత్రులు భారీగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ మండల అధ్యక్షులు జూపాక కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిదురాల వాసు,ఉపాధ్యక్షులు ఏగడి వెంకటేశ్వర్లు,కోశాధికారి లాలయ్య,సహాయ కార్యదర్శి గంపల శివకుమార్,ప్రచార కార్యదర్శి ముండ్రాతి సాయిని శ్రీను,ఈసీ మెంబర్లు కుదురుపాక రాజేష్,పెండ్యాల ప్రభాకర్,జర్నలిస్టులు గౌరీ శంకర్,వెంకటేశ్వర్లు,పోలే బోయిన గోపాల్,గుండారం శ్రీను,సాయి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: