CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రావణాసుర దహనాన్ని నిషేదించాలి

Share it:

 


ప్రజా,యువజన, విద్యార్థి సంఘాలు

     దేశవ్యాప్తంగా రావణాసుర బొమ్మ దహనం నిషేధించాలని అని ఈ రోజు ఇల్లందు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో MRPS - DYFI - PDSU - SFI - PDSU సంఘాల ఆధ్వర్యంలో రావణాసుర బొమ్మతో నిరసన వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంగా MRPS రాష్ట్ర నాయకుడు మంతెన వసంతరావు, DYFI జిల్లా నాయకుడు కాళంగి హరిక్రిష్ట, PDSU జిల్లా అధ్యక్షుడు కాంపాటి ప్రుద్వీ, SFI జిల్లా ఉపాధ్యక్షుడు భయ్య అభిమన్యు, PDSU జిల్లా అధ్యక్షుడు ఎ సాంబ మాట్లాడుతూ..

   భారతదేశం విభిన్న తెగల, జాతుల సమైక్యత అని రాజులు రాచరిక పాలన కాలంలో జరిగిన యుద్ధాల నేపథ్యాన్ని అనుసరిస్తూ ఒకరిని ఒకరు చంపడం దానిని పండుగా జరుపుకోంటు ఒక సంస్కృతిగా, అచరంగా నేటికి అనుసరించడం సిగ్గుచేటని రాముడు దేవుడు కాదని, రావణాసురుడు రాక్షసుడు కాదని రావణాసురుని కూడా నేటికీ కొన్ని తెగలు, జాతులు దైవంగా భావిస్తున్నాయని ఈ పండుగల నేపథ్యం అసర చేసుకొని పాలకులు ప్రజలను మూఢనమ్మకాలో ముంచుతు ప్రజలను చైతన్యం కాకుండా చూస్తున్నారు అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదని తక్షణం పండుగలు ఏమైనా ఇలాంటి దహన కార్యక్రమాలను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో MRPS నాయకులు అర్జున్ రావు, హర్షవర్ధన్, PDSU నాయకులు రేణుక, స్పదన, శిరీష, SFI నాయకులు షాహింద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: