గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 12 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధులు ముగించుకొని ఆళ్ల పల్లి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు మార్గమధ్యలో అటకాయించి అక్బర్ ను తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని భావించి వదిలి వెళ్ళిపోయారు. అదే మార్గంలో వస్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆళ్లపల్లి తీసుకువచ్చి చికిత్స అందించారు. బంధువులు ఆళ్ల పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
Post A Comment: