మన్యం టీవి, పినపాక:
పినపాక మండలానికి చెందిన సీనియర్ విలేకరి, నవ తెలంగాణ రిపోర్టర్ శ్రీరాం బృహస్పతి టిఆర్ఎస్ పార్టీ లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన ఫోటో మండలం లో హాట్ టాపిక్ గా మారింది .
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల వ్యాప్తంగా అన్నీ పార్టీల వారు ఆశక్తి గా గమనించారు .
బృహస్పతి టిఆర్ఎస్ పార్టీ లో చేరిక విషయం పై బృహస్పతి ను వివరణ తీసుకోవడం కోసం రిపోర్టర్ ప్రయత్నం చేయగా సదరు రిపోర్టర్ ఫోను లో అందుబాటులోకి రాలేదు
సదరు విషయం పై బృహస్పతి మిత్రుల వద్ద స్పందిస్తూ ఇట్టి విషయం పై బుధవారం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలియజేసినట్టు సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం
Post A Comment: