మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు,పినపాక మండలాల పరిధిలో ని భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నందు వివిధ లొకేషన్లలో పనిచేస్తున్న కార్మికులు,మంగళవారం టిఆర్వీ కె ఎస్ యూనియన్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జెన్కో కార్యదర్శి చారుగుండ్ల.రమేష్ ఆధ్వర్యంలో చేరారు.ఈ సందర్భంగా ఎస్కె.రహీం జేపీఏ,ఎం.జాన్ మని జేపీఏ,వి.రవీందర్ జేపీఏ, పి.సందీప్ జేపీఏ,ఎండి. రహమతుల్లా పిఏ ను గులాబీ కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాస్, రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎస్కె. సాధిక్ పాష, కేటిపిఎస్-7 వ దశ రీజినల్ నాయకులు ఎండి. అమీన్,బిటిపిఎస్ రీజనల్ నాయకులు ప్రకాష్, రామ్మోహన్,హర్జ్యా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: