CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సడక్ బంద్ రోడ్లను స్తంభింపచేసిన అఖిలపక్షం

Share it:

 


 గుండాల అక్టోబర్ 5 (మన్యం మనుగడ) సడక్ బంద్ తో రోడ్లను స్తంభింపచేసిన అఖిలపక్ష నాయకులు. మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో అదిలాబాద్ నుండి అశ్వారావు పేట వరకు సడక్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల కేంద్రంలో సడక్ బంద్ ను విజయవంతంగా కొనసాగించారు. న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ , టీజేఎస్, పార్టీలకు చెందిన అఖిలపక్ష నాయకులు స్థానిక గురుకుల పాఠశాల వద్ద ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ప్రధాన ఎజెండాతో చేపట్టిన బంద్ విజయవంతం అయ్యే విధంగా అఖిలపక్ష నాయకులు కృషి చేశారు. టీఆర్ఏస్ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచిన పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు. పట్టాలు ఇవ్వకపోగా హరితహారం పేరుతో కోడు భూములను రైతుల వద్ద నుండి తీసుకొని మొక్కలు నాటుతున్న అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంతవరకు ఉద్యమాలు ఆపేది లేదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, జెడ్ పి టి సి రామక్క, ఈ సం శంకర్, కొమరం శాంతయ్య , ఈ సం పాపారావు, గుండాల ఎంపీటీసీ సంధాని, ముత్యమా చారి, జే సీతారామయ్య , దేవరకొండ శంకర్, కోడెం వెంకటేశ్వర్లు , ఇల్లెందుల అప్పారావు, వాగబోయిన రమేష్ , రాసు ఉద్దీన్, గోపగాని శంకర్రావు, గొల్లపల్లి రమేష్ , గడ్డ రాములు , పర్షిక రవి, తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్

Share it:

Post A Comment: