బంద్ నేపథ్యంలో సిఐ భాను ప్రకాష్ పటిష్ఠ భద్రత
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ విజయవంతం.బంద్ నేపథ్యం లో మణుగూరు సిఐ భాను ప్రకాష్ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభమైన పోడురైతుల కేకలు.పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం నిర్వహించారు. బూర్గంపాడు,మణుగూరు, పినపాక మండలాల్లో ప్రధాన రహదారులపై బైటాయించిన పోడు రైతులు,రోడ్ల పైనే వంట వార్పు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ భాను ప్రకాష్ పర్యవేక్షణలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: