మన్యం మనుగడ, పినపాక:
అక్టోబరు 6 నుండి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని దుగినేపల్లి ఎంపీటీసీ యగ్గడి ఉమాదేవి, మొదటి రోజు బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. రంగు రంగు పూలను జత కూర్చి, ముద్దులొలికే గౌరమ్మను తయారు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ ఆడబిడ్డలు అందరు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని సంతోషంగా గడపాలని తెలియజేశారు.
Post A Comment: