మన్యం టీవీ ఏటూరు నాగారం
జంపన్న వాగులో పడి ఓ మత్స్య కార్మికుడు మృత్యువాత పడిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందన వ్యక్తి జంపన్నవాగు సంఘం పాయ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరు నాగారం ఒకటో వార్డుకు చెందిన అంబర కాని చిన్న నరసయ్య, సమ్మక్క దంపతుల కుమారుడు రవి మంగళవారం కూలి పనులకు వెళ్తూ ఉండగా వాగులో ఏర్పడిన గుంతలో పడ్డాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయి మృతి చెందినట్లు తెలిపారు.మృతుడికి భార్య కుమార్తె ఉన్నారు.
Post A Comment: