మన్యం మీడియా డెస్క్:: గిరిజన ముద్దుబిడ్డ,కాకతీయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ ను అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకుడు జారే ఆదినారాయణ, విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టిన ఈసం నారాయణ. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయ జువాలజీ లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎందరో విద్యార్థులకు బంగారు బట్టలు వేసి, కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్ స్కీమ్) సమన్వయకర్తగా నియమితులైన శుభసందర్భంలో ఆదినారాయణ, విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి గౌరవంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో జారే ఆదినారాయణ వెంట విద్యార్థులు కుంజా కుమార్,రేగా పండు,మెడియం వెంకటేష్, కూరం అశోక్,పూనెం కల్పన, తెల్లం రేష్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: