గుండె సమస్యతో బాధపడుతున్న బాలికకు రూ.10వేలఆర్థిక సాయం
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని
ఎల్చిరెడ్డి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తోకల పీరయ్య- లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె మజ్ను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం అం తెలుసుకున్న జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ, స్వయంగా బాలిక ఇంటికి వెళ్లి ఆర్థిక సాయంగా 10వేల రూపాయలను అందజేయడం జరిగింది. జనం కోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ పేదరికంలో ఉండి అనారోగ్యం పాలైన వారిని, ఆర్థికంగా ఆదుకోవడం కోసమే ఏర్పడిందని, సంస్థ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనం కోసం మనం సభ్యులు గూడూరు కృష్ణా రెడ్డి, పూనాటి పాపయ్య, పాపినేని వంశీ, లోకాల సురేష్ బండారు సురేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: