మన్యం టీవీ ఏటూరునాగారం.
బుధవారం ఉదయం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలోని జంపన్నవాగు దగ్గర ఇసుకలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. సదరు వ్యక్తికి దాదాపుగా 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడు 5"4 ఎత్తు, చామన ఛాయ రంగు, తెల్ల గడ్డం కలిగి ఉన్నాడు. మృతుడు తెలుపు రంగు చొక్కా, ఒక పార్టీ ప్రచారానికి సంబంధించిన తెలుపు రంగు టీ షర్ట్, నీలం రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తి మృతికి సంబంధించిన వివరాలేమీ తెలియదు. సంఘటనా స్థలంలో అతనికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. ఊరట్ఠం వీఆర్వో బొప్ప సమ్మయ్య పిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, శవాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం. మృతుడికి సంబంధించిన వారెవరైనా ఉంటే ఎస్.ఎస్.తాడ్వాయి పోలీసు స్టేషన్లో సంప్రదించగలరు.
వివరాల కోసం క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.
ఎస్.ఎస్.తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ -9440700575,
ఎస్సై,ఎస్ ఎస్ తాడ్వాయి ఫోన్ నంబర్ -9440795249 లకు తెలియజేయాలనీ
సీ.ఎచ్.వెంకటేశ్వరరావు
ఎస్సై, ఎస్.ఎస్.తాడ్వాయి పత్రికాముఖంగా తెలియజేసారు.
Post A Comment: