మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రానికి చెందిన సోంపల్లి రామారావు (44) సంవత్సరాలు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఎమ్మార్పీఎస్ స్థాపించిన తొలినాళ్ళలో పినపాక మండల ఎమ్మార్పీఎస్ మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామారావు, మాదిగల పట్ల అనేక సేవలందించి మన్ననలు పొందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రామారావు మృతి మాదిగలకు తీరనిలోటని, పినపాక మండల ఎస్సీసెల్ అధ్యక్షులు సోంపల్లి తిరుపతి అన్నారు. రామారావు తల్లి గత వారం క్రితమే మరణించిందని, దశ దిన కర్మలు కాకుండానే రామారావు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగారు. ప్రభుత్వపరంగా ఈ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం , తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లు సత్తిరెడ్డి, స్వతంత్ర రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Post A Comment: