గుండాల అక్టోబర్ 28 (మన్యం మనుగడ) కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలను విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. గురువారం గుండాల, ఆళ్లపల్లి మండలాలలోని పాఠశాలలను ఆయన సందర్శించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యా రంగం అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు, పాఠశాలలకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆయన కోరారు. పాఠశాలల గ్రాంటును విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక హై స్కూల్ హెచ్ఎం కిషన్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Post A Comment: