మన్యం టివి దుమ్ముగూడెం: మండల కేంద్రంలోని కాశి నగర పంచాయతీ పరిధిలో సూరారం గ్రామంలో లో గల ప్రభుత్వ భూమిని 1/70 చట్టం విరుద్ధంగా ఆదివాసులకి దక్కాల్సిన భూములను కొంతమంది గిరిజనేతరులు కబ్జా చేసి అనుభవిస్తున్నారని ఏ ఎస్ పి డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని హక్కు గిరిజనేతరులకు ఎక్కడిదన నుంచి అని ప్రశ్నించారు అదేవిధంగా తక్షణమే ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరియు అట్టి భూమిని నిరుపేద ఆదివాసుల కేటాయించాలని ప్రభుత్వ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమి పై సర్వే చేసి స్వాధీనపరచు కావాలన్నారు తక్షణమే వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ నరసింహారావు ఏ వి ఎస్ పి నాయకురాలు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: